ఎరువులు :

పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరాకు దుక్కిలో వేసి కలియ దున్నాలి. నత్రజని 8 కిలోలు ఎకరాకు విత్తనం జల్లే ముందు, భాస్వరం ఎకరాకు 20 కిలోలు విత్తనం జల్లే ముందు వేసుకోవాలి. వరి మాగాణుల్లో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. హెక్టారుకు నత్రజని 90 కిలోలు , భాస్వరం 50 కిలోలు , పోటాష్ 30 కిలోలు వేసుకోవాలి . నత్రజని మాత్రము 30 కిలోలు మొదటి దఫా ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుక్కోవాలి . మిగిలిన 60కిలోల్లో ఒక పర్యాయం 30కిలోలు మొదటి గల పూత దశలో అనగా 40 నుండి 50 రోజుల్లో ,మిగిలిన 30కిలోలు రెండవ గల పూత దశలో అనగా 70 నుండి 80 రోజులలో వేసుకుని నీరు కట్టుకోవాలి.