చిత్తపురుగులు :

ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంద్రాలు చేస్తాయి . వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించాకపోతే 80 శాతం మొక్కలు ఈదశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాన్ లేదా 2.0 మి.లీ ఎండోసల్ఫాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .


తామరపురుగులు :

ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పిలుస్తాయి . వీటి వల్ల ఆకు ముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది.పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది . నివారణకు మొనోక్రోటోఫాన్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .


తెల్లదోమ :

ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పిలుస్తాయి . అంతేగాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని( పుల్లాకు తెగులు) కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లి. మొనోక్రోటోఫాన్ లేదా 2 మి.లి. మిథైల్ డేమేటాన్ ను లేదా డ్రైజోఫన్ 2.0 మి.లి . లీటరు నీటికి కలిపి పిచికరి చేయాలి.


మరూకా మచ్చల పురుగు :

ఈ పురుగు మొగ్గ, పూత , పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. పూత దస పూతను గుడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేపుడు కాయలను దగరకు చేర్చినగుడుగా కట్టి కాయలకు రంద్రం చేసి లోపల గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. నివారణకు క్లోరిపైరిఫాస్ 2.0 మీ.లీ. లేదా క్వినాల్ ఫాస్ 2.0 మీ.లీ. మరియు డైక్లోర్ వాస్ 1.0 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .


పొగాకు లద్దె పురుగు :

ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినటం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి,ఆకులను పూర్తిగాను,పువ్వులను, పిందెలను కూడా తింటాయి . ఈ పురుగులు రాత్రి పుట ఎక్కువగా తింటూ , పగలు మొక్కల మొదలలోను భూమి నేర్రేలలోను చేరతాయి . నివారణకు ఈ క్రింద సూచించిన సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించాలి.

  • 1.గ్రుడ్ల సముదాయాలను ఎరివేయాలి.
  • 2.జల్లెడగామారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి .
  • 3.ఎకరాకు 30000 ట్రైకోగ్రం బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి.
  • 4.ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉద్రుతిని గమనించాలి .
  • 5.ఎకరాకు ఎన్.పి.వి.200 యల్.ఇ ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారి చేయాలి .
  • 6.పురుగు ఉధృతి అధికంగా ఉన్నపుడు పొలంలో విషపు 'ఎర' ముద్దల్ని వెదజల్లాలి .ఎకరాకు మోనోక్రోటోఫాన్ 500 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500 మీ.లీ. లేదా కార్బరిల్ 50 శాతం 500గ్రా, 5 కిలోల తవుడు , అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వేదజల్లాలి.
  • 7.చివరిగా ఎండోసల్ఫాన్ 2 మీ.లీ. మోనోక్రోటోఫాన్ 1.6 మీ.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలి .
  • 8.మరిన్ని వివరాలకై మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.