agriculture ap

వేరుపురుగు

వేరు పురుగు యొక్క తల్లి పురుగులు (పెంకు పురుగులు)తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి పొలంలో వున్న వేప/రేగు చెట్లను ఆశిస్తాయి.

బాగా ఎదిగిన వేరుపురుగు లార్వా 'ఈ' ఆకారంలో వుండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది.

తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది.

వేరుపురుగు ఆశి౦చిన మొక్కలు వాడి,ఎండి చనిపోతాయి.మొక్కను పీకితే సులువుగా ఊడి వస్తాయి.మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.

బెట్ట పరిస్థితులలో ఒక్క సారి పంట చచ్చి పోతుంది.

విత్తనము 1కి.గ్రా కు 61/2 మి.లీ క్లోరిపైరి ఫాస్ పట్టించి విత్తవలెను.

150 కి.గ్రా.ల వేపపిండి దుక్కిలో వేయవలెను.

లోతు దుక్కి చేయడం వలన వేరుపురుగు కోశస్థదశబయట పడి పక్షులు వాటిని తింటాయి.

agriculture ap

ఎర్రగొంగలి పురుగు

ఈ పురుగు అనంతపురం,చిత్తూరు,కడప,కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఆశిస్తుంది.

వేసవిలో దుక్కులు చేస్తే భూమి లోని పురుగు యొక్క కోశస్థ దశలు నశిస్తాయి.

వర్షం పడిన 2 నుండి 3 రోజుల లోపుల రాత్రివేల 7 నుండి 11 గంటల వరకు మంటలు వేసి రెక్కల పురుగులను నివారించుకోవాలి. తల్లి పురుగులు గోడలమీద,కలుపు మొక్కలమీద పెట్టిన గుడ్ల ను ఏరి నాశనము చేయాలి.

గుడ్ల దశ గమనించిన వే౦టనే 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడి మందును చల్లుకోవాలి.

గట్ల మీద దొండ లాంటి పాదులను,చేలో అలసంద లేక ఆముదమును ఎర పంటగ వేసుకోవాలి.

జిల్లెడు లేక అడవి ఆముదము కొమ్మలను చేలో అకడక్కడ ఏర్పరిచి లార్వాలను ఆకర్షించాలి.

చేను చుట్టూతా నాగలి చాలు తీసి కార్బరిల్ లేక ఎండోసల్ఫాన్ లేక మిథైల్ పెరాధియాన్ పొడి మందును చల్లి పురుగుల వలసల ను ఆపాలి.

5 శాతం వేప గింజల కషాయం లేక 5మి.లీ వేప నూనె లేక మోనోక్రోటోఫాస్ 2మి.లీ లేక క్వినాల్ఫాస్ 2మి.లీ లేక క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి లార్వాలు కనిపించిన యెడల పిచికారి చేయాలి.

బాగా ఎదిగిన లార్వాలను నివారించుటకు 10 కి.తవుడుకి ఒక కిలో బెల్లము మరియు ఒక లీ.క్వినాల్ఫాస్ కలిపి విషపు ఎర తయారుచేసి పొలంలో చల్లాలి.

agriculture ap

*ఆకుముడత

ఆకుముడత విత్తిన 15 కోజుల నుండి ఆశిస్తుంది.

ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాటిలోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు వుంటాయి.ఇవి 2,3 ఆకులను కలిపి వాటిలో వుండి,పత్రహరితాన్ని తినివేయడం ఆకులన్ని ఎండి,కాలినట్లు కనపడతాయి

నివారణకు అంతర పంటలుగా జొన్న,సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి.

ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని,ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నపుడు క్రిమి సంహారక మందులు వాడవలసిన అవసరం లేదు.

క్వినాల్ ఫాస్ 2.0మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

agriculture ap

పొగాకు లద్దెపురుగు

తల్లి రెక్కల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు గుంపులుగా వుండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి,జల్లెడ ఆకుగా మారుస్తాయి.బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినివేస్తాయి. రాత్రిపూట ఇవి మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి.పగటి వేళ ఈ పురుగులు భూమిలో దాగిఉంటాయి.

వేసవిలో లోతు దుక్కి చేయాలి.ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి.

ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం,ప్రొద్దు తిరుగుడు మొక్కలు ఎర పంటలుగా ఉండేటట్లు చూడాలి.

గుడ్ల సముదాయాన్ని,పిల్ల పురుగులను ఏరి వేయాలి.

100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్.పి.వి. ద్రావణాన్ని ఒక ఎకరాకు చల్లాలి.

50గ్రా.వేపగింజల పొడిని లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి.

క్వినాల్ ఫాస్ 2మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేక వేపనూనె 5మి.లీ లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేయాలి.

ఎకరాకు 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి.

ఎదిగిన లార్వాలకు విషపు ఎర తయారు చేసి(వారి తవుడు 5 కిలోలు బెల్లం 1/2 కిలో మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 1లీ. ఎకరా పొలంలో సాయంత్రం పూట చల్లాలి.

agriculture ap

తామర పురుగు

పువ్వులలోను మరియు విచ్చుకున్నటువంటి లేత ఆకులలో నివసిస్తాయి.

నోటితో ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి.గీకిన ప్రాంతాలలో తెల్లని మచ్చలు పడి ఆకులు ముడతలు పడి కనిపిస్తాయి.

మొవ్వుకుళ్ళు వైరస్ వ్యాప్తి చేస్తాయి.

ఉధృతి ఎక్కువైనపుడు డైమిధోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

agriculture ap

వేరుశనగ కాయ తొలుచు పురుగు

-ఇది ఎక్కువగా కాయలు నిల్వయుంచినపుడు వస్తుంది.

తల్లి పురుగులు గోధుమ రంగులో వుండి,వేరుశనగ కాయలపై తెల్లటి గ్రుడ్లను పెడతాయి.

పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్ళి పొడిగా మారుస్తాయి.ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలు చేసి బయటకు వచ్చి కాయలపై, సంచుల పై గూళ్లు కట్టుకు౦టాయి.

నివారణకు కాయల్లోగాని,విత్తనాల్లో గాని తేమ శాత౦ 9కి మించి ఉండరాదు.

కిలో కాయలకు 5 మి.లీ వేపనూనె లేదా కానుగనూనె కలిపినచో దాదాపు 5 నెలల వరకు కాయతొలుచు పురుగు నుండి కాపాడవచ్చు.

agriculture ap

శనగ పచ్చ పురుగు

తల్లి పురుగులు లేత ఆకుల మీద,పూమొగ్గల మీద తెల్లని గ్రుడ్లను పెడతాయి.

లార్వా శరీరం మీద పలచటి నూలు లాంటి రోమాలు ఉంటాయి.

మొగ్గలను,పువ్వులను ఎక్కువగా తింటాయి.

లింగాకర్షణ బుట్టలు వాడి ఉధృతి తెలుసుకోవాలి.

గ్రుడ్డు దశలో ట్రైకోగ్రామా కార్డులను ఉపయోగించాలి (21/2 కార్డు ఎకరాకు)

గ్రుడ్డు దశ,చిన్న పురుగు దశలలో వేప గింజల కషాయం బాగా పని చేస్తుంది.

పక్షి స్థావరాలు ఎకారాకు 10 చొప్పున పెట్టాలి. బిటి ద్రావణం ఎకరాకు 400మి.లీ లేదా ఎన్.పి.వి వైరస్ ద్రావణం.

100మి.లీ ఎకరాకు పిచికారి చేయాలి.

ఒక లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.0మి.లీ లేక క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1.0 గ్రా.చొప్పున పిచికారి చేయాలి.

agriculture ap

పేనుబ౦క

బెట్ట పరిస్థితులలో వీటి ఉధృతి అధికం.వర్శాలోస్తే ఉధృతి తగ్గుతుంది.

మొవ్వలు,లేత ఆకులు,రెమ్మలనుండి రసాన్ని పీలుస్తాయి.

అక్షింతల పురుగులు,సిర్పిడ్స్,లేస్ వింగ్స్ వంటి భక్షకాలు,పేనుబంకను సమర్ధవంతంగా నివారిస్తాయి.

మొవ్వుల మీద పేనుబంక అధికంగా ఉన్నప్పుడు డైమిధోయేట్ 2మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి సులభంగా నివారించవచ్చును.